ఆరంభం
ఈ అనంత విశ్వంలో ఒక మానవుడి విలువ ఎంత?
మహా సముద్రంలో నీటి బిందువంత.
ఈ భూమి మీద ఆదిమ మానవడు పుట్టినప్పటినుండి
ఇప్పటి వరకు ఎన్నో వేల కోట్ల మంది మానవులు పుట్టారు, మరణించారు.
ఇంకా పుడుతున్నారు, మరణిస్తున్నారు.
ఇంతమందిలో చరిత్ర గుర్తు పెట్టుకొన్నది ఎంత మందిని?
ఈ మొత్తం జరిగిన చరిత్రలో ఎక్కువమందికి తెలిసిన మహానుభావులెవరు?
మహాత్మా గాంధీ, మధర్ థెరెసా, ఐన్ స్టీన్, న్యూటన్ లేదా మరికొద్ది మంది
మరి మిగిలిన వారి సంగతి?
“పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?” అని మహాకవి వేమన అన్నట్లు
వారి గురించి ఎవరికీ తెలియదు.
మరి ఇంతమంది చరిత్ర కెక్కని సామాన్యులు తమ జీవితంలో సాధించేదేమిటి?
అసలు ఎమీ సాధించని జీవితంకంటే మృతశిశువుగా జన్మించడం ఉత్తమమా?
మనలో చాలామంది జీవితంలో ఏదో సాధించడం మాట అటుంచి
ఇంత… అల్పమైన జీవితం కోసం అబద్దాలాడుతూ, మోసాలు చేస్తూ, నానా అగచాట్లు పడుతుంటారు.
ఇంకా చేతనైనవాళ్ళు దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేస్తూ, ఇతరులను దోచుకుంటూ జీవిస్తున్నారు.
ఎవరికోసం ఇదంతా? ఎందుకోసం ఇదంతా?
మంచిగా బతకడం ఈ ప్రపంచంలో అంత కష్టమా? కావచ్చు.
అయితే అందరూ మంచిగా బతకగలిగే సమాజన్ని ఎవరు సృష్టిస్తారు?
ఈ కలికాలంలో ఏ దేవుడు దిగి వస్తాడు?
ఏ మహానుభావుడు మనలని ఉద్దరిస్తాడు?



manavuni jevitam vudaripa padedi oka manavuni valle.
dopidilu, dongatanalu , abadalu adadatam,mosaginchatam valla thathkalikamga sukapadina valla jeevitham lo anandaniki chotu vundadhu.
swachamayina jeevitam jeevinche vadiki vunde manasanthi anantham.
mahathmulu manchi panulu cheyatam valla magathavaru suka padatharu, varini migatha varu gurthinchaka poyina mahathmulu badapadaru, edu kante vaau manchi panulu niswardamayina gunam tho chestaru.kani evarayite varini gurthistaro variki mahatmula manchi lakshanalu alavadathayi. jeevita satyam thesokanantha kalam manavulu vudarimpa padaru. manvuniki chaitnyam manasunundi kalagasinde.
మానవుని జీవితం ఉధరింప పడేది ఒక్క మానవుని వల్లే.
దోపిడీలు, దొంగతనాలు, అబధాలు ఆడటం, మొసగించటం వల్ల తాత్కలికంగ సుఖపడిన, వాళ్ళ జీవితం లో ఆనందానికి చోటు ఉండదు.
స్వఛమయిన జీవితం జీవించె వారికి ఉండె మనశాంతి అనంతం.
మహాత్ములు మంచి పనులు చెయటం వల్ల మిగతవారు సుఖ పడతారు, వారిని మిగత వారు గుర్తించక పోయిన మహత్ములు భాదపడరు, ఎందుకంటె వారు మంచి పనులు నిస్వార్దమయిన గుణం తొ చేస్తారు. కాని ఎవరయితే వరిని గుర్తిస్తారో వారికి మహాత్ముల మంచి లక్షణాలు అలవడతాయి. జీవిత సత్యం తెసుకోనంత కాలం మానవులు ఉధరింప పడరు. మానవునికి చైత్న్యం మనసు నుండి కలగాలసిందే.
(please bear with my spelling mistakes
)